Gulf Andhra Radio

Total Pageviews

Popular Posts

Friday, February 1, 2013

మన బ్రతుకిక "ఆధార్ " యేనా ?

మొన్న రేషన్ కార్డు నిన్న గుర్తింపు కార్డు నేడు ఆధార్  కార్డు అంటుంది మన సర్కార్ మరి రేపేమిటొ? ప్రజల బ్రతుకిక త్రిశంకు స్వర్గామేనా ? ఏ దేశమేగినా ఎందుకాల్లిడిన పొగడరా  నీ తల్లి భూమి భారతిని అని అన్నాడు రాయప్రోలు  ఆనాడు ,  ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా ప్రజలకు కస్టాలు తప్పవు అంటున్నాయి మన ప్రభుత్వాలు .ఈనాడు . రేషన్ కార్డు లేకుంటే గుప్పెడు మెతుకులు కూడా దొరకవు అనే స్థాయి నుండి ఆధార్  కార్డు లేకుంటే వండుకోవడానికి గ్యాస్ కూడా కష్టం  అనే స్థాయి కి పెరిగాయి ప్రజల తిప్పలు .

      ఇది ఏంటి  అనుకుంటున్నారా? అవునండి మీ ఆధార్  కార్డు ,ఒక బ్యాంకు ఎకౌంటు లేకపోతే ఇక నుండి మీకు సబ్సిడీ పై గ్యాస్ కూడా రాదు. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఇది . మనకు వచ్చే గ్యాస్ సిలిండర్ కు మనం చెల్లించే ధర 470 రూపాయలు కాని చమురు కంపెనీలు అమ్మే ధర మాత్రం 1030 రూపాయలు అంటే మిగిలిన 560 రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నమాట . ఇంత వరకు కూడా ఇదే పద్ధతి కొనసాగింది ,
ఇకపై కూడా ఇదే పద్ధతి కొనసాగినా కొంచెం తిరకాసు ఉంది అది ఏంటి అంటే సిలిండర్ తీసుకునే సమయం లోనే మీరు పూర్తి ధర అంటే 1030 రూపాయలను చెల్లించాలి , దానిపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 560 రూపాయలూ మీకు తరువాత ఆధార్ సంఖ్య ఆధారంగా తెరువబడిన బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి దీనికి పెద్ద తతంగమే ఉన్నది . దీనికోసం మీరు ముందుగా మీ గ్యాస్ డీలర్ దగ్గర మీ ఆధార్  సంఖ్యను మీ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి దీనికి ఈ నెల 15 తుది గడువు . ఇలా నమోదు చేసిన తరువాత మీరు గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు 1030 చెల్లిస్తే 1 నెల తరువాత మీ సబ్సిడీ మొత్తం 560 రూపాయలు మీకు బ్యాంకు ద్వారా అందుతాయి. దీని వెనుక చాల విషయం ఉన్నది  అది ఏంటి అంటే ఒక నెల పాటు  ఈ మొత్తాన్ని చమురు కంపెనీలు తమ వద్ద ఉంచుకోవడం ద్వారా వాటిని పెట్టుబడులుగా  మలచుకొని వాటి ద్వారా కూడా లాభాన్ని ఆర్జించ వచ్చును అనేది చమురు సంస్థల ఆలోచనగా ఉంది .దీని వల్ల సామన్యునికి ఎటువంటి లాభం లేక పొగా చమురు సంస్థలు లాభాపడుతున్నాయి. ఒక ఇంటిలో ఏడాదికి 8 సిలిండర్లను వాడితే దానిపైన ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తం 570 కోట్లు ఇదే మొత్తం ఇప్పుడు వారికి పెట్టుబడిగా మారితే ఎంతలాభం ? దీని వలన సామాన్యునికి ఎమన్నా లాభం ఉన్నదా ? చమురు కంపెనీలకు తప్ప 

    ఇక ఈ ఆధార్  కార్డుల విషయానికి వస్తే మన రాష్ట్రం లో 8 కోట్ల మందికి గాను 6 కోట్లమందే  ఈ కార్డులకు నమోదు చేసుకున్నారు ఇంకా 2 కోట్ల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది  , నమోదు చేసుకున్న 6 కోట్ల మందిలో 4 కోట్ల మందికే ఆదార్  కార్డులను పంపిణీ   చేసారు ఇంకా 2 కోట్ల మందికి పంపిణీ  చెయ్యాల్సి ఉన్నది మరి వీటిని గ్యాస్ కనెక్షన్ లకు ఇతర ప్రభుత్వ సేవలకు ముడి పెట్టడం ఎంత వరకు సమంజసం ? ఇక దీనిలో ఇంకొక అంశం ఏంటి అంటే వీటికి సంబంధించిన అన్ని విషయాలను ఆన్ లైన్ లోనే చూసుకోవాలి అట మరి మన రాష్ట్రం లోనే 2.5 కోట్ల మందికి అంతర్జాల పరిజ్ఞానం లేదు మరి వారి సంగతేంటి ?
    
    ఇక ఈ కార్డులను భారతదేశం లో ఉన్న వారికి మాత్రం ఇస్తున్నారు  మరి విదేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి ? రేపు వారు మళ్ళీ  మన దేశానికి తిరిగివచ్చినప్పుడు వారు ప్రభుత్వ సేవలను పొందాలంటే వారికి దిక్కేది ?
   కాబట్టి ఏదో చేసేశాం  అంటూ చేతులు దులుపుకోవడం కాదు ప్రజలకు కష్టాన్ని దూరం చేసి  సులువుగా అందరికి అర్ధమయ్యే రీతిలో ప్రభుత్వ నిర్ణయాలు పధకాలు ఉంటే శ్రేయస్కరం .

               ఉదయ్  ఆకుల 

                 రేడియో జాకీ 

Saturday, May 21, 2011

అంతర్జాలపు మాయాజాలం లో నేటి యువత

అంతర్జాలం (ఇంటర్నెట్) ఈ మాట వినని వారు గ్రామాలలో సైతం ఉండరేమో?నేటి మానవుని నిత్యావసరాలలో ఇది కూడా ఒకటిగా మారి పోయింది.ఇది మానవుని జీవితాలను ఎంతగా అల్లుకుపోయింది అంటే ఇది లేకుండా ఏ పని చెయ్యలేని పరిస్థితి. ఈ అంతర్జాలం మానవునికి సౌఖ్యాన్ని ఇచ్చినా దానితో పాటే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా యువత దీనికోసం తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటుంది.అతి సర్వత్రా వర్జేయత్ అని మన పెద్దలు అంటారు, అది దీనికి కూడా వర్తిస్తుంది.ఈ అంతర్జాలాన్ని ఏ వయసువారు ఎక్కువగా ఉపయోగిస్తున్నారో, ఎంత శాతం ఉపయోగిస్తున్నారో గణాంకాలను చూద్దాం.2001 లో19%  మంది పాటశాల విద్యార్ధులు,23% మంది యువతీయువకులు,26% మంది ఉద్యోగినులైన స్త్రీలు,13% మంది కళాశాల విద్యార్ధులు,9% మంది పెద్ద వయస్కులు 10% మంది గృహిణులు ఈ అంతర్జాలాన్ని ఉపయోగించేవారిలో ఉన్నారు.ఇవే గణాంకాలు 2009 కి వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయి 14% మంది  పాటశాల విద్యార్ధులు,౩౦% మంది యువతీయువకులు,28%మంది ఉద్యోగినులైన స్త్రీలు 13% మంది కళాశాల విద్యార్ధులు, 8% మంది పెద్ద వయస్కులు, 7% మంది గృహిణులు. అంటే యువతీయువకులు ఈ అంతర్జాలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అన్నమాట.ఇప్పుడు ఎక్కువగా ఏ ఏ నగరాల నుండి ఈ అంతర్జాలం  యొక్క ఉపయోగం ఎక్కువగా ఉందో చూద్దాం.భారత దేశం లోని అంతర్జాల వినియోగదారులలో 37% మంది ముంబై,బెంగుళూరు,ఢిల్లీ,కలకత్తా,చెన్నై,పూణే,హైదరాబాద్,అహ్మదాబాద్,సూరత్,నాగపూర్ వంటి 10  నగరాలనుండే ఉన్నారు. వీరిలో కూడా యువతీయువకులే ఎక్కువగా ఉండటం విశేషం.51% మంది అంతర్జాల వినియోగదారులు కేవలం డేటింగ్/ఫ్రెండ్ షిప్  వెబ్సైటులను మాత్రమె చూస్తారు దీనిలో ఎక్కువగా 19-35 సంవత్సరాల మధ్యవయస్కులే ఉండటం గమనించదగ్గ విషయం . అంటే యువత అవసరానికి మించి ఈ అంతర్జాలపు మాయాజాలం లో చిక్కుకొంటోంది.ముఖ్యంగా FACEBOOK ,ORKUT ,IBIBO,YAHOO వంటి సోషల్ నెట్వర్కింగ్  సైట్స్ వల్ల స్నేహాన్ని పెంచుకొనే వీలున్నా సమయాన్ని ఎక్కువగా వృధా చేసుకుంటున్నారు.దీనిలో తమ వ్యక్తిగత వివరాలను వెల్లడించడం ద్వారా చాల ఇబ్బందులకు గురి అవుతున్నారు.మరి కొంత మంది అయితే ఏకంగా తమ జీవిత భాగాస్వాములును ఎన్నుకోవడానికి వీటిని సాధనాలుగా వాడుతున్నారు.అంతే కాకుండా యువతీయువకులు అసభ్యమైన వెబ్సైటులను చూడటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.ప్రతి 100  మంది లో 65 మంది విద్యా సంబంధిత విషయాలను కోసమై అంతర్జాలాన్ని ఉపయోగిస్తూ ఉండగా 87 మంది మాత్రం వ్యర్ధం అయిన విషయాలతో కూడిన చాటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు.ఏటా 
10% మంది అంతర్జాల వినియోగదారులు మానసిక రోగాలకు గురి అవుతున్నారు.పెరుగుట విరుగుట కొరకే అని నానుడి అలాగే మన సౌఖ్యం కోసం ఉపయోగపడాల్సిన అంతర్జాలం మన జీవితాలను నాశనం చేసే స్థాయికి ఎదిగింది. దీనివల్ల కాపురాలలో కలహాలు ఏర్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా ఇక్కడ యువత ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలి అవసరం అయినంతవరకు ఉపయోగిస్తే ఈ అంతర్జాలం మన మిత్రుడితో సమానం అదే అనవసరంగా ఉపయోగిస్తే అదే మన జీవితాన్ని నాశనం చేసే శత్రువు అవుతుంది .కాబట్టి అంతర్జాలపు మాయాజాలం నుండి తప్పుకోవడానికి మేలుకో యువతా మేలుకో .

Monday, February 14, 2011

నిషా నీడలో నేటి యువత






మాదక ద్రవ్యాలు(డ్రగ్స్) ఈ పేరును ఈ మధ్య మనం తరుచుగా వింటున్నాం.దీనికి అలవాటైన యువత ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు.మాదక ద్రవ్యాలు అవసరమా అనే ప్రశ్న నేటి యువత వేసుకోవాలి. ఏదో సరదాగా కాలక్షేపానికో, స్నేహితుల ప్రోద్భలంతోనో అలవాటైన ఈ మాదక ద్రవ్యాలు వ్యసనంగా మారి ప్రాణాలనే హరించే పరిస్థితి ఎదురవుతుంది.

మాదక ద్రవ్యాలు:-నల్ల మందు, గంజాయి,హెరాయిన్,కోకైన్,చరస్,హశస్,మార్ఫియా మొదలగునవి మాదక ద్రవ్యాలు. ఇవి విపరీత మత్తును కలిగించేవి.
వీటిని వాడటం ద్వారా ఏ ఏ ప్రమాదాలు కలుగుతాయో చూద్దాం

మాదక ద్రవ్యాల వాళ్ళ కలిగే ప్రమాదాలు:-

1. వీటికి అలవాటు పడిన వారు వాటిని వదల లేరు.
2. వారిలో ఇంగిత జ్ఞానం నశిస్తుంది.
3. వాటిపై అధిక ధనాన్ని దుర్వినియోగం చేస్తారు
4. ధనం లేకపోతే దొంగతనం,దోపిడీ,అప్పులు వంటి పనులకు ఒడిగడతారు.
5. ఇవి లభింపకపోతే వారు నిర్వీర్యులగుతారు.
6. వారి ఆరోగ్యం క్షీణిస్తుంది.
7. చట్ట రీత్యా వీటిని వాడటం నేరం.అందువల్ల రహస్యంగా వీటిని పొందటంలో నేరం చేసి అరెస్ట్ అవుతారు.
8. మాదక ద్రవ్యాల జాడ్యం జాడ్యం కలాశాలలలోను, విశ్వ విద్యాలయలలోను కూడా ప్రవేశించి యువతీ యువకులను బానిసలుగా చేస్తుంది .
9. పలు రకాల వ్యాధులు నరాలు చిట్లి పోవడం, మతి భ్రమించడం వంటివి కలిగి మాదక ద్రవ్యాల వినియోగదారులు(బానిసలు) మరణిస్తారు
ఇంతటి అనర్ధాలను కొని తెచ్చే మత్తు పదార్ధాలు మనకు అవసరమా? విచక్షణా జనాన్ని హరించే మాదక ద్రవ్యాలు మనకు అవసరమా? నేర ప్రవృత్తిని పెంచే అవలక్షణం మనకు అవసరమా? సమాధానం మాత్రం అవసరం లేదనే ఉంటుంది. మన అంతరాత్మ చెబుతూనే ఉంటుంది అది తప్పు చెయ్యొద్దని చెబుతున్నా ఎందుకు వినం? మన చేతులారా మన భవిష్యత్తుని మనమే ఎందుకు కాలరాస్తున్నాం? మన తల్లిదండ్రుల ఆశలను అడి ఆశలు చేస్తున్నాం? విజ్ఞతతో ఆలోచిద్దాం వీటికి స్వస్తి చెబుదాం.
భారత దేశం లో ఉన్న యువతలో 64% మంది యువత మత్తు పదార్ధాలకు అలవాటుపడ్డారు.
ఈ మధ్యనే ఒక సంస్థ చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే 90% మంది ఇంటర్ విద్యార్ధులు మద్యానికి బానిసలు
అవుతున్నారని. దీనిని బట్టి ఆలోచించండి మన యువత ఎటు వైపు పయనిస్తుందో? ఇంతకూ వీటి వాళ్ళ ఎం
ప్రయోజనం ఉందని ఆలోచిస్తే తేలే విషయం నిష్ప్రయోజనం అని మరి అటువంటి మత్తు పదార్ధాలు మనకు అవసరమా?
సరదాకని మొదలుపెడితే అది మన ప్రాణాల్నే హరిస్తుంది.
వీటిని వాడటం ద్వారా చట్టాన్ని అతిక్రమించినవారంగా జైలు శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది.
వీటికి చక్కని ఉదాహరణలను మనం ప్రతి రోజూ వార్తా పత్రికలలో చూస్తూనే ఉన్నాం.మనం నిత్యం ఆరాధించే,అనుసరించే సినీ తారలే ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వారిని చూసి ఇంకొందరు ఇలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా తయారవుతుంది యువత.
మార్కెట్ లో పిప్పర మెంట్ బిళ్ళలు దొరికినట్లుగా ఈ మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి. వీటిని అమ్మే వాళ్ళు లేక పోతే కొనే వాళ్ళు ఉండరు కొనే వాళ్ళు లేక పోతే అమ్మే వాళ్ళు ఉండరు కాబట్టి మన వంతు భాద్యతను నిర్వర్తిద్దాం. వీటిని కొనకుండా ఉందాం. అంతే కాకుండా వీటి సమాచారాన్ని పోలీసులకు అందిద్దాం .
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి , చెడునడతనుండి వారిని తప్పించాలి. చేతులు కాలాకా ఆకులు పట్టుకొని ఏం లాభం? కాబట్టి వారిని ముందునుండే గమనించాలి.
ఈ మత్తులో మునిగి తమ జీవితాలను నాశనం చేసుకున్న వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకుందాం.వీలయితే వారిలో మార్పు తీసుకువద్దాం యువతగా ఇది మన బాధ్యత. కాబట్టి మేలుకో యువతా మేలుకో.

Saturday, January 29, 2011

ప్రేమ నేరమా?




అవును నేను వేసిన ప్రశ్న సరి ఐనదే "ప్రేమ నేరమా?"
ఎందుకంటే ఇంతకు ముందు టపాలో నేను చెప్పినట్టుగా మన ప్రేమ ఇంకొకరి ప్రాణాలను తీసే విధంగానో లేక ఇతరుల మనసును నొప్పించేదిగానో ఉండకూడదు.
ఐనా ప్రేమ అనేది ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి కి సంబంధించిన అంశమేనా ఒక అమ్మాయి అబ్బాయి స్నేహంగా ఉండలేరా?
మనం ప్రేమించిన వాళ్ళు మనలను ప్రేమించక పోతే అది వాళ్ళు చేసిన నేరమా? వారు ప్రేమించనందుకు వారి ప్రాణాల్ని తియ్యాలా?
వారు మనలాగా ఒక తల్లి బిడ్డలే కదా?క్షణికావేశం లో చేసిన ఆ తప్పు వల్ల ఎన్ని జీవితాలు బాధపడతాయి? ఉదాహరణకు మన రాష్ట్రం లో ప్రేమ పేరుతొ జరిగిన కొన్ని దాడుల గురించి చూద్దాం. స్వప్నిక &ప్రణీత ఈ పేర్లు గుర్తున్నాయా? గుర్తుండే ఉంటుంది. వీరిపై వరంగల్ లో ప్రేమోన్మాదులు యాసిడ్ తో దాడి చేసారు ఈ దాడిలో స్వప్నిక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోగా ప్రణీత మాత్రం మృత్యువుని జయించింది. మరి ఈ దాడి చేసిన వారి పరిస్థితి ఏంటి అంటే ఎన్కౌంటర్ లో వారు కూడా మరణించారు. ఇక రాజమండ్రి లో అనుష ప్రేమంచలేదన్న అక్కసుతో గొంతుకోసాడొక ప్రేమోన్మాది. ఈ దాడిలో అనుష తల్లి దండ్రులు మరణించగా అనుష తీవ్ర గాయాలతో బయటపడింది. ఇకపోతే విజయవాడ లో జరిగిన శ్రీ లక్ష్మి హత్య కూడా ఇలాంటిదే ప్రేమించలేదని కళాశాలకు వెళ్లి మరీ చంపి వచ్చాడు ఆ ప్రబుద్ధుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీరంతా చేసిన నేరం ఏమిటి ప్రేమించకపోవడమా? ఇలా దాడులు చేసిన వారంతా ఎందుకు చేసారు ? ప్రేమించడం వల్లనా?రెండిటికి సమాధానం "అవును". ప్రేమించడం తప్పుకాదు కానీ ఆ ప్రేమను వ్యక్తీకరించిన తరువాత ఎదుటి వ్యక్తి భావాలను గౌరవించాలి. మనం ప్రేమించినంత మాత్రాన అవతలి వారు మనల్ని ప్రేమించాలి అన్న నిబంధన ఏమి లేదు కదా? మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? మనుషులం అనే విషయాన్ని మరచి మృగాల్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మన ఇంటిలోని వారిని ఎవరన్నా ఎమన్నా అంటే రోషం పొడుచుకు వస్తుంది మనకి మరి ఎదుటి వారు కూడా అలంటి వారే అనే భావన అప్పుడు ఎందుకు కలగదు? ఆలోచించండి మృగాలలాగా కాకుండా మనుషుల్లా ప్రవర్తిద్దాం పాటశాలలో చేసిన "భారత దేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు" అనే ప్రతిజ్ఞను జ్ఞాపకం తెచ్చుకుందాం అప్పుడు మనలో సోదర భావం కలిగి కనీసం కొంచెమన్నా వివేకం కలిగి ప్రవర్తిస్తామేమో? ఇవన్నీ చేసేది యువతే మంచి చెయ్యాలన్నా చెడు చెయ్యాలన్నా యువత మీదే ఆధారి పడి ఉంటుంది.
మరి మన వంతు భాద్యతగా ఇలాంటివి జరగకుండా చూడాలి కదా? కాబట్టి మేలుకో యువతా మేలుకో

Friday, January 28, 2011

నేటి యువత

నేటి యువత పయనం ఎటు వైపు?
సినిమాల వైపా? మాదక ద్రవ్యాలవైపా? ప్రేమ వైపా?
లేక సమాజ సేవ వైపా? ఆలోచిస్తే, ప్రతి ఒక్కరు తమ జీవితాలను పరిశీలిస్తే సమాధానం తెలిసిపోతుంది.
సినిమాలు చూడటం తప్పుకాదు ఆ సినిమాలోని మంచిని తీసుకొని చెడును విసర్జించగలగాలి .
మాదక ద్రవ్యాలు అవసరమా అనే ప్రశ్న నేటి యువత వేసుకోవాలి. ఏదో సరదాగా కాలక్షేపానికో, స్నేహితుల ప్రోద్భలంతోనో అలవాటైన ఈ మాదక ద్రవ్యాలు వ్యసనంగా మారి ప్రాణాలనే హరించే పరిస్థితి ఎదురవుతుంది. మరి అలాంటివి అవసరమా?
ఇక ప్రేమ, ప్రేమించడం తప్పు కాదు మన ప్రేమ ఇంకొకరి ప్రాణాలను తీసే విధంగానో లేక ఇతరుల మనసును నొప్పించేదిగానో ఉండకూడదు.
మనం ప్రేమించినంత మాత్రాన ఎదుటి వారు మనల్ని ప్రేమించాలని ఏమి లేదు కదా. మరి ఈ విషయాన్నీ ఆలోచించకుండా మనం చావడమో లేక ఎదుటి వారిని చంపడమో ఎంతవరకు సమంజసం? ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం తర్వాత తిరిగి తల్లిదండ్రులపై కేసులు పెట్టడం ఎంతవరకు సరి ఐనది?అల చేస్తే కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పించి, మనకంటూ సమాజంలో ఒక గుర్తింపునిచ్చిన వారి హృదయాలు ఎంత క్షోభిస్తాయి? ముదిమి వయసులో మన చేయూతనందుకొని శేష జీవితాన్ని ఆనందంగా గడపాలనుకొనే వారి కల నెరవేరుతుందా? ఆలోచించండి
ఇక సమాజ సేవ విషయానికి వద్దాం. సమాజసేవ అంటే ఏదో దేశాన్ని ఉద్ధరించేయడం కాదు మన వంతుగా ఎదుటి వారి హక్కులను కాలరాయకుండా ఉండటం. మనహక్కులు ఎదుటి వారికి భాద్యతలు అలాగే ఎదుటి వారి హక్కులు మనకు భాద్యతలు.
మనం ఏ విధంగా మన హక్కులను అనుభవించాలి అని అనుకుంటున్నామో ఎదుటి వారు కూడా అలానే ఆలోచిస్తారు.
మరి ఇది సమాజ సేవ కాదంటారా?
ఆలోచించండి, యువత తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే సమ సమాజాన్నిస్థాపించవచ్చు కాబట్టి మేలుకో యువతా మేలుకో.